ఏప్రిల్ నెలనుంచి అమలులోకి రాబోతున్న 12 కొత్త నిబంధనలు

1. మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబరు లింక్ చేశారా? లింక్ చేయకపోతే, ఏప్రిల్ నుంచి ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. పాన్, ఆధార్ లింక్ చేయడానికి ఆఖరు తేదీ 31-3-2021. కానీ ఈ గడువును 30-6-2021 వరకు పొడిగించడమైనది.

2. ఇటీవల ఎనిమిది ప్రభత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి మూడు బ్యాంకులుగా మార్చారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి పాత బ్యాంకులకు చెందిన పాస్ బుక్స్, చెక్ బుక్స్ పనిచేయవు. ఈ నిబంధనను కూడా ప్రభుత్వం కొంచెం సడలించి పాత చెక్ బుక్కులను 30-6-2021 వరకు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.

3. ఇన్ కమ్ టాక్స్ కొత్త స్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాలి.

4. ఇకపై ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ కోసం ప్రి -ఫిల్డ్ ఫామ్స్ రానున్నాయి. దీనివలన పన్ను చెల్లింపుదారులు సులువుగా రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.

5. మార్చి 31 న ఎల్. టి. సి. స్కీమ్ లో ఇచ్చిన మినహాయింపులు ముగుస్తాయి, ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి మినహాయింపులూ ఉండవు.

6. ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారినుంచి టి. డి. ఎస్. పై ఎక్కువ రేటు వసూలు చేయనున్నారు.

7. ఏప్రిల్ 1 తర్వాత 75 ఏళ్ల పైన ఉన్నవారు ఆదాయపు పన్ను (ఇన్ కమ్ టాక్స్) రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వారి పన్నులను బ్యాంకులనే డిడక్ట్ చేయమంటున్నది.

8. కొత్త వేతన-కోడ్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతున్నది. మొత్తంగా ఉద్యోగుల టేక్ – హోమ్ సాలరీ తగ్గుతుంది.

9. ఒక కంపెనీలో ఐదేళ్లు వరుసగా సేవలు అందించాక ఉద్యోగులకు గ్రాట్యుటీ లభిస్తుంది.

10. ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ రేట్లు పెరగనున్నాయి.

11. టూరిజం ను ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ను అందిస్తోంది.

12. ఏప్రిల్ 1 నుంచి టి. వి., రిఫ్రిజిరేటర్, ఏ.సి. ధరలు పెరగనున్నాయి. విడిభాగాల కొరతతో పాటు, ప్రభుత్వం కస్టమ్స్ ద్యూటీ పెంచడం లాంటి కారణాలతో వీటి ధరలు పెరగనున్నాయి.

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.